దుమ్ములేపుతున్న ఎంత మంచివాడవురా! ట్రైలర్
ఈ వేడుకకి నందమూరి కళ్యాణ్ రామ్ సోదరుడు ఎన్టీఆర్ ముఖ్య అతిధిగా హాజరైయ్యారు. ఎన్టీఆర్ చేతుల మీదుగా మూవీ ట్రైలర్ విడుదల చేశారు.
నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన తాజా చిత్రం ఎంత మంచివాడవురా!. ఇక సినిమా విడుదల తేది దగ్గర పడుతుండడంతో చిత్ర యూనిట్ ప్రమోషన్ల జోరును పెంచేసింది. అందులో భాగంగానే చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ని బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకి నందమూరి కళ్యాణ్ రామ్ సోదరుడు ఎన్టీఆర్ ముఖ్య అతిధిగా హాజరైయ్యారు. ఎన్టీఆర్ చేతుల మీదుగా మూవీ ట్రైలర్ విడుదల చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడిన... ఎన్నీఆర్ , తన సోదరుడు కళ్యాణ్ రామ్ చిత్రాన్ని ఆదరించాలని కోరారు. అలాగే బన్నీ నటించిన అలవైకుంఠపురంలో.. మహశ్ బాబు సరిలేరు నీకెవ్వరు, రజనీ దర్భార్ చిత్రం కూడా ఆదరించాలని ప్రేక్షకులను కోరారు. ఈ సినిమా వేడుకలో నన్ను భాగస్వామ్యం చేసినందుకు సినిమా యూనిట్ కి ధన్యవాదాలు అని తెలిపారు. కళ్యాణ్ విభిన్న సినిమాలు చేశారు. ఎన్ని చేసిన నాకో కోరిక ఉండేది ఒక మంచి ఫ్యామిలీ మూవీ చేయాలని ఇప్పుడు నా కోరిక ఈ చిత్ర దర్శకుడు వేగేశ్న సతీష్ తీర్చాడడని అన్నారు.
ఆదిత్య మ్యూజిక్లో సినిమా నిర్ణించడం సంతోషకరమని అన్నారు. ఎంత సంతోషంగా ఈ కార్యక్రమానికి వచ్చారో అంతే ఆనందంలో ఇంటికి వెళ్లండి. ఈ కార్యక్రమాని నందమూరి అభిమాను భారీ సంఖ్యలో హాజరైయ్యారు.
ఈ చిత్ర ట్రైలర్ విషయానికి వస్తే కుటుంబ కథా చిత్రంగా ఉంది, యాక్షన్ను సీన్స్ ఆకట్టుకున్నాయి. ఈ సినిమాకు రాజీవ్ కనకాల చాలా రోజుల తర్వాత లాంగ్ లెన్త్ పాత్రలో చేస్తున్నారు. రాజీవ్ కనకాల ఈ సినిమాలో విలన్ చేస్తున్నారు. ట్రైలర్ కళ్యాణ్ రామ్ చేప్పే డైలాగ్స్ పేలుతున్నాయి. ఎదురుతిరిగేవాడు రానంత వరకే రా.. భయపెట్టేవాడు రాజు అంటూ చెప్పే డైలాగ్ బాగుంది.
సతీష్ వేగేశ్న దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ సరసన మెహ్రీన్ హీరోయిన్గా నటించింది. వి.కె.నరేశ్, సుహాసిని, శరత్బాబు, తనికెళ్ల భరణి, పవిత్రా లోకేశ్, రాజీవ్ కనకాల, వెన్నెల కిశోర్, ప్రవీణ్, ప్రభాస్ శ్రీను తదితరులు ఇతర పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా ఈ నెల 15 న విడుదల చేస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్ , టీజర్, పోస్టర్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాని ఆదిత్య మ్యూజిక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై ఉమేష్ గుప్తా, సుభాష్ గుప్తా నిర్మిస్తోన్న ఈ చిత్రానికి శ్రీదేవి మూవీస్ శివలెంక కృష్ణప్రసాద్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. గోపీ సుందర్ సంగీతం సమకూరుస్తున్నారు.