ఓటీటీ వేదికగా సాయి తేజ్ 'సోలో బ్రతుకే సో బెటర్'?

Solo Bratuke So Better : కరోనా వలన ధియెటర్లు మూతపడడంతో మేకర్స్ సినిమాలని ఓటీటీ వేదికగా రిలీజ్ చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అందులో భాగంగానే ఇప్పటికే కీర్తి సురేశ్‌ 'పెంగ్విన్‌', సుధీర్‌బాబు, నాని 'v' చిత్రాలు రిలీజ్ అయి మంచి విజయాన్ని అందుకున్నాయి.

Update: 2020-09-27 05:06 GMT

solo Bratuke So Better 

Solo Bratuke So Better : కరోనా వలన ధియెటర్లు మూతపడడంతో మేకర్స్ సినిమాలని ఓటీటీ వేదికగా రిలీజ్ చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అందులో భాగంగానే ఇప్పటికే కీర్తి సురేశ్‌ 'పెంగ్విన్‌', సుధీర్‌బాబు, నాని 'v' చిత్రాలు రిలీజ్ అయి మంచి విజయాన్ని అందుకున్నాయి. త్వరలోనే అనుష్క నిశబ్దం, రాజ్ తరుణ్ ఒరేయ్ బుజ్జిగా చిత్రాలు కూడా విడుదల కానున్నాయి. ఇప్పుడు మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న సోలో బ్రతుకే సో బెటర్ అనే చిత్రం ఓటీటీ వేదికగా రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు..

వాస్తవానికి ఈ సినిమాని మే01 న రిలీజ్ చేయాలనీ మేకర్స్ భావించారు. కానీ కరోనా వలన వాయిదా పడింది. అయితే ఇప్పుడు ఈ సినిమాని ఓటీటీ వేదికగా రిలీజ్ చేసేందుకు ఓ ప్రముఖ ఓటీటీ సంస్థ ఒప్పందం చేసుకున్నట్టుగా సమాచారం.. " పే పర్ వ్యూ" పద్ధతిలో సినిమాని అందించేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం వేగంగా జరుపుకుంటున్న ఈ సినిమాని దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు మేకర్స్..

ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ సరసన నభా నటేష్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా ద్వారా సుబ్బు అనే కొత్త దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు. తమన్ సంగీతం అందిస్తున్నాడు.. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్‌ఎల్‌పీ బ్యానర్‌పై ఈ సినిమా రూపొందుతుంది. పండగ చేసుకో లాంటి సినిమా తరవాత సాయి తేజ్ నుంచి వస్తున్న సినిమా కావడంతో సినిమా పైన భారీ అంచనాలు ఉన్నాయి.  

Tags:    

Similar News