Radha Krishna Kumar: అదే "రాధేశ్యామ్" ను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళింది అంటున్న డైరెక్టర్

Radha Krishna Kumar: అదే "రాధేశ్యామ్" ను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళింది అంటున్న డైరెక్టర్

Update: 2022-02-26 10:30 GMT

అదే "రాధేశ్యామ్" ను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళింది అంటున్న డైరెక్టర్

Radha Krishna Kumar: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమా "రాధేశ్యామ్". "జిల్" ఫేమ్ రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ఎప్పుడో సంక్రాంతి సందర్భంగా జనవరి 14న విడుదల కావాల్సిన ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా పడింది. ఇక తాజాగా సినిమాని మార్చ్ 11 న థియేటర్ లలో విడుదల చేయబోతున్నారు దర్శక నిర్మాతలు. టి సిరీస్ మరియు యు.వి క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా లో కృష్ణంరాజు, భాగ్య శ్రీ, సచిన్ ఖెడేకర్, తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

ఫాంటసీ ప్రేమకథగా పీరియడ్ బ్యాక్ డ్రాప్తో సాగే ఈ సినిమాలో ప్రభాస్ ఒక హస్తసాముద్రికుడి పాత్రలో కనిపించనున్నారు. వరుసగా చార్ట్ బస్టర్ లను అందిస్తున్న ఎస్.ఎస్ థమన్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నారు. "అఖండ", "భీమ్లా నాయక్" వంటి సినిమాలలో తన నేపథ్య సంగీతంతో ప్రేక్షకులను మంత్ర ముగ్దుల్ని చేసిన ఎస్ ఎస్ థమన్ ఈ సినిమాలో కూడా అదిరిపోయే బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చినట్లు డైరెక్టర్ రాధాకృష్ణ చెబుతున్నారు. ఎస్.ఎస్ తమన్ అందించిన సంగీతం రాధేశ్యామ్ సినిమాని నెక్స్ట్ లెవెల్ కి ఎలివేట్ చేసిందని తమన్ పై ప్రశంసల వర్షం కురిపించారు రాధాకృష్ణ.

Tags:    

Similar News