Cyberabad: రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లకు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసుల ఝలక్

Cyberabad: రామ్ చరణ్ , జూనియర్ ఎన్టీఆర్ ల ఇద్దరికీ హెల్మెట్లు పెట్టి ఝలక్ ఇచ్చిన సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు

Update: 2021-06-30 06:35 GMT

ఆర్ ఆర్ ఆర్ పోస్టర్ (ఫైల్ ఇమేజ్)

Cyberabad: అవును మీరు విన్నది నిజమే...!! మెగా హీరో రామ్ చరణ్ , జూనియర్ ఎన్టీఆర్ ల ఇద్దరికీ మన సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు హెల్మెట్లు పెట్టి ఝలక్ ఇచ్చారు కాని అది డైరెక్ట్ గా కాదులెండి ఫోటోలో మాత్రమే. ప్రస్తుతం ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న భారీ బడ్జెట్ చిత్రం "ఆర్ ఆర్ ఆర్" సినిమాకి సంబందించిన పోస్టర్ ను ఆ చిత్ర యూనిట్ సోషల్ మీడియాలో విడుదల చేసింది దానికి సంబందించిన పోస్టర్ లో జూనియర్ ఎన్టీఆర్ బైక్ ని డ్రైవ్ చేస్తుండగా రాంచరణ్ వెనుక కూర్చొని ఉంటాడు. ఈ ఫోటోని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు రామ్ చరణ్ మరియు జూనియర్ ఎన్టీఆర్ లకి హెల్మెట్ పెట్టుకున్నట్లుగా ఎడిట్ చేసి "హెల్మెట్ ధరించండి.. జాగ్రత్తగా ఉండండి" అనే ట్యాగ్ లైన్ ని జోడించి ట్విట్టర్ లో పోస్ట్ చేసారు.

ఈ పోస్ట్ కి పలువురు నెటిజన్లు వారిద్దరూ హెల్మెట్ ధరించనందుకు ఆ చలాన్ ని ఆర్ ఆర్ ఆర్ మూవీ ప్రొడ్యూసర్ చెల్లించాలని సరదాగా ట్రోల్ చేయగా, ఆర్ ఆర్ ఆర్ టీం ఆ బైక్ కి నెంబర్ ప్లేట్ కూడా లేదని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసుల ట్వీట్ కి రీ-ట్వీట్ చేసింది. ప్రస్తుతం రెండు పాటలు మినహా షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ఆర్ ఆర్ ఆర్ చిత్రం వీలయినంత త్వరగా సినిమాని విడుదల చేయాలని చూస్తుంది.. దాదాపుగా 350 కోట్లతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని డి వి వి దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రంలో రామ్ చరణ్ 'అల్లూరి సీతారామరాజు' , జూనియర్ ఎన్టీఆర్ "కొమరం భీం" పాత్రలో కనిపించబోతున్నారు. ఈ చిత్రంలో అలియా భట్ , అజయ్ దేవగన్ మరియు పలువురు హాలీవుడ్ నటీనటులు కనిపించబోతున్నారు. ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ఎం ఎం కీరవాణి సంగీతాన్ని సమకూర్చారు.


Tags:    

Similar News