త్వరలో విడుదల కానున్న మెగా హీరో సినిమా టీజర్

Update: 2019-03-10 05:24 GMT

'సుప్రీమ్' హీరో సాయి ధరమ్ తేజ్ వరుసగా ఆరు డిజాస్టర్లు అందుకోవడంతో అతని మార్కెట్ బాగా పడిపోయింది అని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం తన తదుపరి చిత్రం అయిన 'చిత్రలహరి' సినిమాపైనే తన ఆశలన్నీ పెట్టుకున్నాడు ఈ మెగా మేనల్లుడు. కిషోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా లో కళ్యాణి ప్రియదర్శన్ మరియు నివేదపేతురాజ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కనున్న ఈ చిత్ర షూటింగ్ ఈ మధ్యనే పూర్తయింది. ప్రస్తుతం చిత్ర బృందం నిర్మాణాంతర పనులతో బిజీగా ఉంది.

తాజా సమాచారం ప్రకారం కళ్యాణి ప్రియదర్శన్ ప్రస్తుతం తన పాత్రకు డబ్బింగ్ చెప్పింది. ఇక ఈ సినిమా టీజర్ ను విడుదల చేయడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది. హోలీ కానుకగా ఈ చిత్ర టీజర్ విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తోంది అని తెలుస్తోంది. ఈ చిత్ర టీజర్ విడుదల గురించి అధికారిక ప్రకటన త్వరలో వెలువడనుంది. సునీల్ ఈ సినిమాలో ముఖ్య పాత్రలో కనిపించనున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమా ఏప్రిల్ 12 న విడుదల కానుంది.

Similar News