Chiranjeevi consoles Paruchuri Venkateswara Rao : పరుచూరి వెంకటేశ్వరరావును పరామర్శించిన చిరంజీవి

Chiranjeevi consoles Paruchuri Venkateswara Rao: ప్రముఖ రచయిత పరుచూరి వెంకటేశ్వరరావు భార్య పరుచూరి విజయలక్ష్మి గుండె పోటుతో చనిపోయారు. ఆమె మరణ వార్తతో టాలీవుడ్ లో విషాదఛాయలు అలుముకున్నాయి.

Update: 2020-08-07 07:16 GMT

Chiranjeevi consoles Paruchuri Venkateswara Rao: ప్రముఖ రచయిత పరుచూరి వెంకటేశ్వరరావు భార్య పరుచూరి విజయలక్ష్మి గుండె పోటుతో చనిపోయారు. ఆమె మరణ వార్తతో టాలీవుడ్ లో విషాదఛాయలు అలుముకున్నాయి. సినీ రంగానికి చెందిన ప్రముఖులు తమ సంతాపాన్ని ప్రకటిస్తున్నారు. విజయలక్ష్మి మరణవార్త తెలిసిన వెంటనే మెగాస్టార్ చిరంజీవి పరుచూరి వెంకటేశ్వరరావుకు ఫోన్ చేసి పరామర్శించారు. తన ప్రగాఢ సానభూతిని తెలిపారు. పరుచూరి వెంకటేశ్వరరావు తనకు ఎంతో ఆత్మీయుడని, ఆ కుటుంబంతో తనకు మంచి అనుబంధం ఉందని ఆయన పేర్కొన్నారు. విజయలక్ష్మి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నానని చిరంజీవి అన్నారు.

పరుచూరి వెంకటేశ్వరరావు భార్య విజయలక్ష్మి ఈ తెల్లవారుజామున కన్నుమూశారు. ఆమె వయసు 74 సంవత్సరాలు. ఇవాళ ఉదయం గుండెపోటుతో తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు విజయలక్ష్మి. ఆరోగ్య ప‌రిస్థితి విషమించ‌డంతో హైదరాబాద్‌లోని స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. విజయలక్ష్మి మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపాన్ని తెలియ‌జేశారు. మాటల రచయితగా, నటుడిగా ప్రసిద్ధుడు పరుచూరి వెంక‌టేశ్వ‌ర‌రావు. సోద‌రుడు పరుచూరి గోపాల‌కృష్ణ‌తో కలిసి వందలాది తెలుగు సినిమాలకు కథ, మాటలు, స్క్రీన్‌ప్లే అందించారు.


Tags:    

Similar News