మైత్రి మూవీ మేకర్స్ వారికి విరుద్ధంగా ఫిర్యాదు

*మైత్రి మూవీ మేకర్స్ వారికి విరుద్ధంగా ఫిర్యాదు

Update: 2022-06-14 12:00 GMT

మైత్రి మూవీ మేకర్స్ వారికి విరుద్ధంగా ఫిర్యాదు

Mythri Movie Makers: ప్రముఖ నిర్మాణ సంస్థలు అయిన మైత్రి మూవీ మేకర్స్ మరియు శ్రేయాస్ మీడియా గ్రూప్ ల పై పోలీసు కేసు నమోదయ్యింది. వివరాల్లోకి వెళితే జూన్ 9వ తేదీన శిల్పకళావేదికలో నాని హీరోగా నటించిన "అంటే సుందరానికి" సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ వేడుకకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ముఖ్య అతిథిగా విచ్చేశారు.

దీంతో చాలా మంది పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా ఈ ఈవెంట్ కి తరలివచ్చారు. అయితే మైత్రి మూవీ మేకర్స్ మరియు షో హోస్ట్ చేసిన శ్రేయాస్ మీడియా వారు ఎక్కడా కూడా కరోనా నిబంధనలను పాటించలేదు.ఈ నేపథ్యంలో ఒక వ్యక్తి ఈ విషయమై మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు.

సైబరాబాద్ పోలీస్ కమిషనర్ ఎం స్టీఫెన్ రవీంద్ర నుంచి నిర్వాహకులకు ఎలాంటి అనుమతి లభించలేదని పోలీసులు కూడా తెలిపారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ రెండు జరిగిన మరుసటి రోజున దరఖాస్తు కమిషనర్ టేబుల్ వద్దకు చేరిందని తెలుస్తోంది. ఇక ఇలాంటి ఈవెంట్లు ఏమైనా ఏర్పాటు చేస్తున్నప్పుడు దరఖాస్తుదారులు పర్మిషన్ లెటర్ వంటివి చాలా జాగ్రత్తగా పరిశీలించి బాధ్యతగా వ్యవహరించాలని అధికారులు పేర్కొన్నారు.

Tags:    

Similar News