తెలుగు చిత్రపరిశ్రమలో విషాదఛాయలు అలముకున్నాయి. రచయిత, నటుడు జాన్ కొట్టాలీ ఆకస్మికంగా కన్నుమూశారు. హైదరాబాద్ లోని కుకట్పల్లిలో ప్రగతినగర్లో నివాసం ఉంటున్న మను గుండెపోటుతో తుది శ్వాస విడిచారు. ఆయన పార్థివ దేహాన్ని స్వస్థలం కేరళకు బుధవారం తరలించనున్నారు.
జాన్ కొట్టాలీ ఫలక్నుమా దాస్, మను, రక్తం, యుద్ధం శరణం సినిమాల్లో నటించి మెప్పించారు. మిస్టర్ అమాయకుడు, కళాకారుడు, సైన్మా అనే లఘు చిత్రాల్లో కూడా నటుడిగా మంచి గుర్తింపు పొందారు. మను మరణ వార్తను ప్రముఖ దర్శకుడు సాయి రాజేష్ ట్విటర్ ద్వారా వెల్లడించారు.
జాన్ కొట్టాలీకి ఇండస్ట్రీలోని అందరితో పరిచయం ఉంది. జాన్ కొట్టాలీ మరణాన్ని ఆయన సన్నిహితులు జీర్ణించుకోలేకపోతున్నారు. టాలీవుడ్ ప్రముఖులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. దర్శకుడు సాయి రాజేశ్, నటుడు సత్యదేవ్, హీరోయిన్ గాయత్రి గుప్తా పలువురు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జాన్ కొట్లాలీ చివరి సారిగా "గాడ్ " అనే వెబ్సిరీస్లో నటిచారు.
Unable to digest the news about @JohnKottoly ... Heard that he was passed away with cardiac arrest..
— Sai Rajesh (@sairazesh) January 28, 2020
Brilliant actor he is...