అభిమానులు గర్వపడేలా ఉంటుంది.. విజయవాడలో మహేష్ సందడి

"సరిలేరు నీకెవ్వరు" అభిమానులు గర్వపడేలా చిత్రం ఉంటుందని సినీనటుడు సూపర్ స్టార్ మహేష్ బాబు తెలిపారు .

Update: 2019-10-13 13:10 GMT

"సరిలేరు నీకెవ్వరు" సినిమా అభిమానులు గర్వపడేలా  ఉంటుందని సినీనటుడు సూపర్ స్టార్ మహేష్ బాబు తెలిపారు . విజయవాడలో సందడి చేశారు.విజయవాడలో నూతనంగా ఎర్పాటు చేసిన ఓ జ్యువెలరి షోరూంను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ... ఏపీలో తొలి షో రూంను ఏర్పాటుచేసినందుకు సంస్థవారికి శుభాకాంక్షలు తెలిపారు. అన్ని సినిమాల 100 రోజుల వేడుకలను విజయవాడలోనే జరిగాయని అన్నారు. విజయవాడ రావడం తనకు సంతోషంగా ఉందన్నారు.

ఈ సందర్భంగా అభిమానులకు దీపావళి శుభాకాంక్షలు తెలపారు. సరిలేరు నీకెవ్వరు చిత్రం సంక్రాంతికి విడుదల అవుతోందని తెలిపారు. అభిమానులు గర్వపడేలా సినిమా ఉంటుందన్నారు. కాగా, మహేష్ బాబు రాక గురించి తెలియడంతో ఆయన్ని చూసేందుకు అభిమానులతో భారీగా తరలివచ్చారు. 



Tags:    

Similar News