ఎన్నికల కౌంటింగ్ సమయం దగ్గరికి వస్తున్న నేపథ్యంలో వైసీపీ కసరత్తు చేపట్టింది. విజయవాడలో వైసీపీ శిక్షణా కార్యక్రమం చేపట్టింది. 23న జరిగే ఓట్ల లెక్కింపు అంశాలపై ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల ఎన్నికల ఏజెంట్లకు శిక్షణ ఇవ్వనుంది. విజయవాడలోని బందర్ రోడ్డు, డీవీ మానర్ హోటల్ ఎదురుగా ఉన్న ఏ1 కన్వెన్షన్ సెంటర్లో ఈ కార్యక్రమం జరుగుతోంది. మాజీ సీఎస్ అజయ్ కల్లం, విజయసాయిరెడ్డి, ఐఏఏస్ శామ్యూల్తో పాటు పార్టీ సినీయర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు శిక్షణ ఇవ్వనున్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఏజెంట్లకు శిక్షణ ఇవ్వనున్నారు.
శిక్షణకు హాజరవుతున్న వారు విధిగా సమయపాలన తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుందని పార్టీ ఇప్పటికే సూచనలు పంపింది. కాగా ఈ శిక్షణా తరగతులకు ఆహ్వానితులతో పాటుగా చీఫ్ ఎన్నికల ఏజెంట్లు అంతా విధిగా హాజరు కావాలని, ఎవరికీ మినహాయింపు లేదని ఎంపీ విజయసాయిరెడ్డి పార్టీ నేతలకు ఇప్పటికే ఓ సర్క్యులర్ పంపిన విషయం తెలిసిందే.