వైసీపీ 125 స్థానాల్లో గెలుస్తుంది: అవంతి శ్రీనివాస్‌

Update: 2019-04-14 10:35 GMT

శ్రీవారి ఆశీస్సులతో వైసీపీ 125 స్థానాల్లో గెలిచి అధికారం చేపడుతుందని ధీమా వ్యక్తం చేశారు వైసీపీ నేత అవంతి శ్రీనివాస్‌. కుటుంబసమేతంగా తిరుమలలో స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు అవంతి శ్రీనివాస్‌కు తీర్థప్రసాదాలు అందించారు. తాను పోటీ చేసిన భీమిలి నియోజకవర్గంలో బంపర్‌ మెజార్టీతో గెలిచి జగన్‌కు బహుమతి ఇస్తానన్నారు. 

Similar News