బీసీల అభివృద్ధికి ఏటా రూ.15వేలకోట్లు:జగన్‌

Update: 2019-02-17 12:48 GMT

వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ బీసీ డిక్లరేషన్‌ ప్రకటించారు. ఏలూరులో జరిగిన బీసీ గర్జన సభలో ఆయన బీసీలపై వరాల జల్లు కురిపించారు. వైసీపీ అధికారంలోకి వస్తే.. బీసీల అభివృద్ధి కోసం ప్రతి ఏడాది బడ్జెట్‌లో 15వేల కోట్లు రూపాయలు కేటాస్తాయిమని, ఐదేళ్లలో రూ. 75వేల కోట్లు బీసీలకు అందిస్తామని జగన్‌ హామీ ఇచ్చారు. అసెంబ్లీ తొలి సమావేశాల్లోనే సమగ్ర బీసీ సబ్‌ప్లాన్‌ చట్టాన్ని తీసుకొస్తామన్న వైఎస్‌ జగన్‌ బీసీల్లోని 139 కులాలకు విడివిడిగా కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. 45 ఏళ్లు నిండిన ప్రతి బీసీ మహిళకు వైఎస్సార్‌ చేయూత కింద 75 వేల రూపాయలు ప్రతి ఏడాది నేరుగా అందజేస్తామని ప్రకటించారు. 

Similar News