కడప జిల్లా ఎర్రగుంట మండలంలోని పొట్లదుర్తిలో వైసీపీ ఏజెంట్, టీడీపీ నేత సీఎం రమేష్ మధ్య వాగ్వాదం జరిగింది. సీఎం రమేష్ పోలింగ్ స్టోషన్ లోకి వెళ్తుండగా వైసీపీ ఏజెంట్ అడ్డుకోవడంతో గొడవ జరిగింది. పోలింగ్ కేంద్రం బయట వైసీపీ ఏజెంట్లంతా కుర్చీలు వేసుకుని కూర్చోవడంపై సీఎం రమేశ్ అభ్యంతరం వ్యక్తంచేశారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఓటర్లను భయపెట్టడం, ప్రలోభపెట్టే అవకాశం ఉందని పేర్కొన్నారు. అయితే, సీఎం రమేశ్ తనపై చేయిచేసుకున్నారంటూ వైసీపీ ఏజెంట్ అనంతరం ఆందోళనకు దిగారు. రోడ్డుపై భైఠాయించి నిరసన తెలిపారు.