శిఖర్ ధావన్ ప్లేస్ ని రీప్లేస్ చేసేది ఎవరు ?

Update: 2019-06-11 10:45 GMT

వరల్డ్ కప్ లో మంచి విజయాలతో దూసుకుపోతున్న టీం ఇండియాకి గట్టి దెబ్బే తగిలింది .. టీం ఇండియా ఓపెనర్ శిఖర్ దవాన్ టోర్నీ మొత్తానికి దూరం అయ్యాడు .. ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో గాయపడ్డ శిఖర్ ధావన్‌కు జట్టు యాజమాన్యం మంగళవారం స్కానింగ్‌ చేయించింది.

దీంతో అతడి వేలికి ఫ్రాక్చర్ అయిందని తేలింది. గాయం తీవ్రత దృష్ట్యా విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. దీంతో అతడు సుమారు మూడు వారాల పాటు టోర్నీకి దూరం కావాల్సి వచ్చింది. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో ఆసీస్ పేసర్ నాథన్ కౌల్టర్ నైల్ వేసిన బంతి ధావన్ చేతిని బలంగా తాకింది.

అయితే గాయం కారణంగా శిఖర్ ధావన్ టోర్నీకి దూరం కావడంతో ఆతడి స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారన్న ఆసక్తి ఇప్పుడు అందరిలోనూ నెలకొంది. ఈ నేపథ్యంలో ధావన్ స్థానంలో రిషబ్ పంత్‌ కి లేదా అంబటి రాయుడు ఛాన్స్ ఇస్తారని చర్చ నడుస్తుంది . ధావన్ లాగే రిషబ్ పంత్ కూడా ఎడమచేతి వాటం బ్యాట్స్‌మన్ కావడంతో అతడివైపే సెలక్టర్లు మొగ్గు చూపే అవకాశం ఉంది. రోహిత్ శ‌ర్మ‌తో కేఎల్ రాహుల్ ఓపెనర్‌గా బ‌రిలో దిగ‌నున్నాడు.

Tags:    

Similar News