టీడీపీ ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ హత్య కేసులో పోలీసులు మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. నందాపూర్ ఏరియా కమిటీకి చెందిన హార్డ్కోర్ మిలీషియా సభ్యుడు జయరాం ఖిల్లాను కోరాపూట్ పోలీసులు అరెస్ట్ చేశారు. కిడారి, సోమ హత్యలో జయరాం ఖిల్లా పాల్గొన్నట్లు పోలీసులు గుర్తించారు. జయరాంను ఎన్ఐఏ కోర్టులో హాజరుపర్చి పోలీసులు కస్టడీకి కోరనున్నారు. ఈహత్య కేసులో పాల్గోన్న నిందితులందరినీ ఒక్కొరొక్కరుగా పోలీసులు అరెస్టు చేయటం జరుగుతోంది. కాగా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్నారు. కిడారి, సోమ హత్య కేసుకు అసలు కారణాలు ఏమిటి, ఎవరెవరు పాల్గోన్నారు, ఎందుకు హత్య చేశారు, అనే కోణంలో విషయాలను పోలీసులు రాబడుతున్నారు.