స్వర్ణభారత్ ట్రస్టు మినీభారత్ను తలపిస్తోంది!
స్వర్ణభారత్ ట్రస్ట్ వరల్డ్ క్లాస్ ఇన్స్టిట్యూట్ అని తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి టీ బీ రాధాకృష్ణన్ అన్నారు.
స్వర్ణభారత్ ట్రస్ట్ వరల్డ్ క్లాస్ ఇన్స్టిట్యూట్ అని తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి టీ బీ రాధాకృష్ణన్ అన్నారు. హైదరాబాద్ శివారు శంషాబాద్ మండలం ముచ్చింతల్లోని స్వర్ణభారత్ ట్రస్ట్ ద్వితీయ వార్షికోత్సవం మరియు సంక్రాంతి వేడుకల్లో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో పాల్గొన్న ఆయన ప్రభుత్వ సహకారం లేకుండా ట్రస్ట్ చేస్తున్న సేవలు ప్రశంసనీయం అని అన్నారు. పేదలు, రైతులు, యువత అభివృద్ధిపై వెంకయ్యనాయుడు కమిటెడ్గా ఉంటారని కొనియాడారు. స్వర్ణభారత్ ట్రస్టు మినీ భారత్ను తలపిస్తోందన్నారు.