చెరువును కాపాడుకునేందుకు ఆ గ్రామస్తుల ప్రయత్నం

Update: 2019-05-20 11:11 GMT

ఊరు బాగు కోసం చెరువు ఉనికి కోసం గ్రామస్తులంతా ఒక్కటయ్యారు. కబ్జాకు గురవుతున్న చెరువు శిఖం కాపాడుకునేందుకు నడుం బిగించారు. నిజామాబాద్ జిల్లా వెల్మల్ గ్రామస్ధులు. వేయి ఎకరాల ఆయకట్టుకు నీరందించే గంగి చెరువు, శిఖం కబ్జాకు గురవుతున్నా స్థలంలో కందకాలు తవ్వారు. మూడు చెరువులో దాదాపు 200 ఎకరాలు కబ్జాకు గురైందని గుర్తించిన గ్రామస్ధులు ఇంటికొకరు చొప్పున తరలి వచ్చి ప్రొక్లెయిన్లతో కందకాలు తవ్వించి చెరువు కబ్జాపై కదిలారు.

Full View 

Similar News