ప్రధానిని కలిసిన టీఆర్‌ఎస్‌ ఎంపీలు

టిఆర్‌ఎస్ పార్టీ రాజ్యసభ ఎంపీలు, లోక్‌సభ ఎంపీలు ఢిల్లీలో ప్రధాని మోడీని కలిసారు.

Update: 2019-01-07 12:33 GMT

టిఆర్‌ఎస్ పార్టీ రాజ్యసభ ఎంపీలు, లోక్‌సభ ఎంపీలు ఢిల్లీలో ప్రధాని మోడీని కలిసారు. దేశ రాజధానిలో టీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయం కోసం భూమి కేటాయింపుపై ప్రధానితో చర్చించారు. రాజ్యసభలోను, లోక్‌సభలోను టీఆర్‌ఎస్‌కు 17 మంది ఎంపీలున్నారని చట్ట ప్రకారం తమ పార్టీకి 1000 చదరపు మీటర్ల స్థలం వస్తుందని ప్రధానికి వివరించారు. అర్బన్ డెవలప్‌మెంట్ గైడ్‌లైన్స్ ప్రకారం 1000 చదరపు మీటర్ల స్థలం ఇవ్వాలని కోరారు. ఢిల్లీలోని రాజేంద్ర ప్రసాద్ రోడ్‌లో ఖాళీగా ఉన్న స్థలాన్ని తమ పార్టీ కార్యాలయం కోసం కేటాయించాలని ప్రధాని మోడీని టీఆర్‌ఎస్ ఎంపీలు కోరారు.

Similar News