నా డబ్బు నాకు ఇవ్వండి : డబ్బు వసూలు చేస్తున్న ఓడిపోయిన అభ్యర్ధి

Update: 2019-06-09 05:17 GMT

ఓటు వేయమంటూ డబ్బిచ్చాను .. కాని ఓటమి పాలయ్యాను నా డబ్బు నాకు తిరిగి ఇవ్వండంటూ ఓటమి పాలైన అభ్యర్ధి డబ్బు తీసుకుంటున్న ఘటన మంచిర్యాల జిల్లాలో చోటు చేసుకుంది. జన్నారం మండలం లింగయ్య పల్లెలో కాంగ్రెస్‌‌ నుంచి ఎంపీటీసీగా పోటీ చేసిన మాదాడి హన్మంత రావు ఓటమి పాలయ్యారు. ఎన్నికల్లో తాను డబ్బులు పంచినా ఓడిపోయాయని.. అందుకే తన డబ్బు తిరిగి ఇవ్వాలంటూ స్ధానికులను కోరారు. దీనికి అంగీకరించిన పలువురు ఓటర్లు తీసుకున్న డబ్బు వెనక్కు ఇచ్చారు. ఎన్నికల్లో ఓటు వేయమని డబ్బు ఇవ్వడం.. ఓడిపోయి డబ్బు వెనక్కు తీసుకోవడం.. బహిరంగంగానే ఇదంతా జరగడం ఆసక్తికర చర్చకు తెరలేపింది. 

Full View

Tags:    

Similar News