లాఠీ చార్జి.. సొమ్మసిల్లిన మహిళ

Update: 2019-05-07 13:02 GMT

తూర్పు గోదావరి ఉప్పాడ కొత్తపల్లి పోలీసు స్టేషన్‌ వద్ద ఉద్రిక్తత నెలకొంది. కొత్తపల్లి పోలీస్‌ స్టేషన్‌ ఎదుట ఉప్పాడ వాసులు బైఠాయించారు. ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే వర్మపై దాడి కేసులో పోలీసులు ఇద్దరిని అరెస్ట్‌ చేశారు. దానికి వ్యతిరేకంగా ఉప్పాడ వాసులు పోలీస్‌ స్టేషన్‌ ను ముట్టడించారు. నిందితులను కోర్టులో హాజరుపర్చేందుకు పోలీసులు తీసుకు వెళ్తుండగా గ్రామస్తులు అడ్డుకున్నారు దీంతో పోలీసులు గ్రామస్తులపై లాఠీఛార్జ్ చేశారు దీంతో గ్రామస్తులు పోలీసులపైకి రాళ్లు రువ్వడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. లాఠీ దెబ్బలకు ఓ మహిళ సొమ్మసిల్లి పడిపోయింది.

Similar News