నిజామాబాద్ స్థానిక సంస్థల కౌంటింగ్ సెంటర్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. నిజామాబాద్ జిల్లాలోని మాక్లూర్ మండలం గొట్టుముక్కల గ్రామం ఎంపీటీసీ బీజేపీ అభ్యర్థి బెంగరి సత్తెమ్మ విజయం సాధించారు. ఎంపీటీసీగా గెల్చిన బీజేపీ అభ్యర్థి సత్తెమ్మను టీఆర్ఎస్ నాయకులు క్యాంపుకు తరలించేందుకు ప్రయత్నించారు. దీంతో బీజేపీ, టీఆర్ఎస్ వర్గాల మధ్య తోపులాట చోటు చేసుకుంది. కౌంటింగ్ కేంద్రం దగ్గర పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.