కరీంనగర్‌లో 45.62 శాతం నమోదు

Update: 2019-04-11 08:46 GMT

దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల తొలి విడత పోలింగ్‌ కొనసాగుతోంది. మొత్తం 18 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లోని 91 లోక్‌సభ నియోజకవర్గాల్లో ఎన్నికల పోలింగ్‌ నడుస్తోంది. తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల్లో మధ్యాహ్నం ఒంటి గంట వరకు కరీంనగర్‌లో 45.62 శాతం, ఖమ్మంలో 41.62 మహబూబాబాద్‌లో 47.29, వరంగల్‌లో 40.24 శాతం నమోదయింది. లోక్‌సభ ఎన్నికల సందర్భంగా గురువారం ముఖ్యమంత్రి కేసీఆర్‌ దంపతులు సిద్దిపేట నియోజకవర్గం చింతమడకలో ఓటుహక్కు వినియోగించుకున్నారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ ఓటు హక్కు వినియోగించుకున్నారు. బంజారాహిల్స్ నందినగర్‌లో తన సతీమణితో కలిసి వచ్చి ఓటు వేశారు. నిజామాబాద్‌ తెరాస ఎంపీ అభ్యర్థి కవిత తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి వచ్చిన ఆమె పొతంగల్‌లో ఓటు వేశారు.

Similar News