ఏపీలో అమిత్ షాకు సెగ

Update: 2019-02-21 06:57 GMT

తూర్పుగోదావరి జిల్లాలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పర్యటనకు వ్యతిరేకంగా నిరసనలు మిన్నంటాయి. రాజమండ్రిలో టీడీపీ కార్యకర్తలు నిరసన ప్రదర్శన చేశారు. క్వారీ సెంటర్లో అమిత్ షా గో బ్యాక్ అంటూ ప్ల కార్డులతో నినాదాలు చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ నినాదాలు చేశారు. ఏపీ బీసీ విద్యార్ధి సంఘం అధ్యక్షుడు దుర్గా యాదవ్ సహా తెలుగుయువత కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  

Similar News