చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో అయిదు రీ పోలింగ్కు ఈసీ ఆదేశాలపై టీడీపీ ఆందోళనకు దిగింది. టీడీపీ శ్రేణులు గురువారం ఉదయం పెద్ద ఎత్తున తిరుపతి సబ్ కలెక్టర్ కార్యాలయం వద్దకు చేరుకుని ధర్నాకు దిగారు. రీ పోలింగ్కు ఈసీ ఆదేశాలపై టీడీపీ శ్రేణులు మండిపడుతున్నారు. వైసీపీ అడిగిన బూత్లలోనే రీపోలింగ్ జరపడంపై టీడీపీ నేతలు అనుమానం వ్యక్తంచేస్తున్నారు. చంద్రగిరి నియోజకవర్గంలోని మరో రెండుచోట్ల రీపోలింగ్కు టీడీపీ డిమాండ్ చేస్తోంది. తాము అడుగుతున్న ప్రాంతాల్లోనూ రీపోలింగ్ నిర్వహించాలని కోరింది. చంద్రగిరి నియోజకవర్గంలోని 166, 310 బూత్లలో రీపోలింగ్ జరపాలని డిమాండ్ చేస్తోంది. అందులో భాగంగా ఇవాళ మరోసారి ఈసీని టీడీపీ నేతలు కలవనున్నారు. టీడీపీ అయిదు బూత్ల్లోకి ఇతరులను లోనికి రానీకుండా రిగ్గింగ్ చేశారంటూ వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్రెడ్డి ఈసీకి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.