పోలవరంను చూసి దేశం గర్విస్తోంది: ఉమా

Update: 2019-05-05 05:55 GMT

మాజీమంత్రి కేవీపీ రామచంద్రరావు బీజేపీ, వైసీపీకి కోవర్టుగా పనిచేస్తున్నారని మంత్రి దేవినేని ఉమా ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో నిర్మాణంలో ఉన్న 16 జాతీయ ప్రాజెక్టుల్లో ఒక్క పోలవరం మాత్రమే 70 శాతం పూర్తైందన్న ఆయన ప్రాజెక్టు ఈ స్థాయికి వచ్చినందుకు దేశం గర్వపడుతుందని తెలిపారు. ఇంతవరకు పోలవరంను కేవీపీ సందర్శించారా అని దేవినేని ఉమా ప్రశ్నించారు. వైఎస్ హయాంలో జలయజ్ఞాన్ని ధనయజ్ఞంగా మార్చారని దుయ్యబట్టారు. ఇరిగేషన్ ప్రాజెక్టుల నిధుల్ని జగన్‌కు దోచిపెట్టింది కేవీపీనే అని ఆరోపించారు. అలాంటి కేవీపీ ఇప్పుడు ప్రాజెక్టులపై ఉత్తరాలు రాస్తున్నారని విమర్శించారు. ఏపీకి రావాల్సిన రూ. 4,580 కోట్లు కేంద్రం ఇంత వరకూ ఇవ్వలేదన్నారు.

Similar News