తెలంగాణ కాంగ్రెస్ను సొంత పార్టీ నేతలే దెబ్బతీస్తున్నట్టు తెలుస్తోంది. మల్కాజ్గిరి ఎంపీ టిక్కెట్ట్ ఓ నేతకు ఆఫర్ ఇవ్వడంతో పార్టీ ఎమ్మెల్యేలతో ఆయన చర్చలు జరుపుతున్నారు. ఇప్పటి వరకూ నలుగురితో చర్చలు జరిపిన ఆయన ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేసి కారెక్కిస్తున్నట్టు తెలుస్తోంది. చిరుమర్తి లింగయ్య, హరిప్రియ నాయక్లను కూడా ఆయనే మీ ఇబ్బందులు తీరుస్తానంటూ హామీలిచ్చి టీఆర్ఎస్లోకి వెళ్లేందుకు ప్రోత్సహించినట్టు తెలుస్తోంది. ఆయన సీఎల్పీ నేత భట్టివిక్రమార్కకు అత్యంత సన్నిహితుడు కావడంతో ఈ వ్యవహారం మొత్తం భట్టివిక్రమార్కకు తెలుసని పార్టీ భావిస్తున్నట్టు చర్చ జరుగుతోంది.