నిబంధనలకు విరుద్దంగా ప్రవర్తించిన వికారాబాద్ జిల్లా కలెక్టర్ సయ్యద్ ఉమర్ జలీల్ను సస్పెండ్ చేస్తూ ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది. నిబంధనలకు విరుద్ధంగా ఈవీఎంలను తెరిచారని, వికారాబాద్ నియోకవర్గంలో అవకతవకలు జరిగాయని కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం ప్రసాద్ ఈసీకి ఫిర్యాదు చేశారు. దీనిపై సీరియస్ అయిన ఈసీ కలెక్టర్పై వేటు వేసింది. ఒమర్ జలీల్ను సస్పెండ్ చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేయడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఘటనపై తదుపరి విచారణకు ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది.