వైసీపీలో విభేదాలు...అంబటి రాంబాబుకు టిక్కెట్టు ఇవ్వొదని...

Update: 2019-01-25 11:02 GMT

గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలో వైసీపీలో విభేదాలు తీవ్రమయ్యాయి. నియోజకవర్గం ఇన్‌చార్జి అంబటి రాంబాబు ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారంటూ ఓ వర్గం మండిపడుతోంది. తమను రాంబాబు కలుపుకోవడం లేదని రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతలు వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణను విజయవాడలో కలిసి ఫిర్యాదు చేశారు. సత్తెనపల్లి టికెట్ అంబటి రాంబాబుకు ఇవ్వొద్దని, వేరే ఎవరికి ఇచ్చినా తాము సహకరిస్తామని బొత్స సత్యనారాయణను కోరారు. దీనిపై బొత్స వారికి సర్ధి చెప్పేందుకు ప్రయత్నించినట్టు తెలుస్తోంది. 

Similar News