గుడ్డు కోసం గొడవ.. యువకుడిని చితకబాదిన రౌడీషీటర్లు

Update: 2019-04-02 07:12 GMT

నిజామాబాద్‌లో ఓ యువకుడిపై రౌడీషీటర్ల దాడి చేస్తున్న విజువల్స్‌ సంచలనం సృష్టిస్తున్నాయి. నగరంలోని కోటగల్లీకి చెందిన సోమినేని రాజుపై ఇద్దరు రౌడీషీటర్లు విచక్షణారహితంగా దాడి చేశారు. ఓ సూపర్‌మార్కెట్‌లో కోడిగుడ్డు కొనే విషయంలో గొడవ మొదలుకాగా రాజుపై శ్రీనివాస్‌, క్రాంతికుమార్‌ అనే రౌడీషీటర్లు సీసాలతో దాడి చేశారు. ఈ ఘటనలో రాజు ముఖంపై తీవ్రగాయాలయ్యాయి. రక్తస్రావం తీవ్రమవడంతో రాజును ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇటు నిందితులపై పోలీసులు ఐపీసీ సెక్షన్‌ 307 హత్యాయత్నం కింద కేసు నమోదు చేశారు. మరోవైపు ఆలస్యంగా వెలుగులోకొచ్చిన ఘటన తాలూకు దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. 

Similar News