గుంపుపైకి దూసుకొచ్చిన టాటాఏస్‌..ఒకరి మృతి

Update: 2019-05-03 07:02 GMT

సికింద్రాబాద్‌ వారాసిగూడలో విషాదం చోటు చేసుకుంది. ఓ బాలుడు ట్రాలీ ఆటో స్టార్ట్‌ చేయడంతో అది జనంపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోగా ఇద్దరు చిన్నారులకు గాయాలయ్యాయి. ఓ ఉత్సవానికి సంబంధించి ఊరేగింపు తీస్తుండగా టాటా ఏస్‌ వాహనం డ్రైవర్‌ బండిని స్టార్ట్‌లోనే ఉంచి పక్కనే ఉన్న షాపులోకి వెళ్లాడు. అదే సమయంలో ఆటోలు ఉన్న బాలుడు స్టార్ట్ చేయడంతో జనంపైకి దూసుకెళ్లింది. దీంతో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోగా మరో ఇద్దరు చిన్నారులకు గాయాలయ్యాయి. కేసు నమోదు చేసుకున్న చిలకలగూడ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిన్న రాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.  

Similar News