ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ సోదరుడు, చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ అస్వస్థతకు గురయ్యారు. ఆరోగ్యం క్షీణించడంతో మెరుగైన వైద్యం కోసం ఆయనను హుటాహుటీన లండన్కు తరలించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని సమాచారం. ఈ నేపథ్యంలో మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి అక్బరుద్దీన్ పై ట్వీట్ చేశారు. మజ్లిస్ పక్ష నేత, చాంద్రాయణ గుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ త్వరగా కోలుకోవాలని ప్రార్ధించారు ఎంపీ రేవంత్ రెడ్డి. అసెంబ్లీలో ప్రజా సమస్యలపై తన గొంతుక వినిపించాలని ఆశిస్తున్నట్లు రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు.