రామ్ చరణ్ అత్త ఓటు గల్లంతు...

Update: 2019-04-11 05:55 GMT

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన తల్లి శోభన కామినేని ఓటు గల్లంతైంది. ఈ విషయమై ఆమె సోషల్ మీడియాలో ఓటు గల్లంతైన విషయాన్ని తెలియజేసింది. ఆమె చాలా కాలంగా హైదరాబాద్‌లోని మాసాబ్ ట్యాంక్ పోలింగ్ కేంద్రంలో తన వోటు హక్కు వినియోగించుకుంటూ వస్తున్నారు. గతవారం చెక్ చేసుకున్నప్పుడు కూడా ఓటర్ల జాబితాలో తన పేరు ఉందని, తీరా ఓటు వేయడానికి పోలింగ్ కేంద్రానికి వెళితే కనిపించలేదని శోభన అన్నారు.


 

Similar News