సార్వత్రిక ఎన్నికలపై తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కీలక ప్రకటన చేశారు. కొన్నాళ్ల క్రితం రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నట్లు ప్రకటించన రజనీకాంత్ లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసే అంశంపై క్లారిటీ ఇచ్చారు. లోక్ సభ ఎన్నికల్లో తాను పోటీ చేయనని ఏ పార్టీకి కూడా మద్దతు ఇవ్వమని స్పష్టం చేశారు. 2021 అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్ అని ప్రకటించారు. రానున్న ఎన్నికల్లో ఎవరైనా తన మద్దతు ఉందంటూ ప్రచారం చేసుకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. రాష్ర్టంలో నీటి సమస్యను పరిష్కరిస్తారని భావించిన వారికి ప్రజలు ఓటు వేయాలని సూచించారు రజనీకాంత్.