గత కొద్దిరోజులుగా ఎన్నికల ప్రచార సభలు, రోడ్ షోలతో ఫుల్ బీజిగా ఉన్న అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ట్రాక్టర్ స్టీరింగ్ పట్టిన రాహుల్ గాంధీఎన్నికల ప్రచారంలో భాగంగా పంజాబ్ లో పర్యటిస్తున్న రాహుల్ బిజీ షెడ్యూల్ నుంచి కాస్త రిలాక్స్ అయ్యారు. లూధియానాలో సరదాగా ఒక ట్రాక్టర్ నడిపారు. పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ , లూధియానా కాంగ్రెస్ అభ్యర్ధి రవనీత్ బిట్టూ, కాంగ్రెస్ నేత ఆశా కుమారి ఈ ట్రాక్టర్ పై రాహుల్ కి కంపెనీ ఇచ్చారు. ఉత్తర్ ప్రదేశ్ ప్రచారానికి వెళ్తూ రాహుల్ గాంధీ తన సోదరి ప్రియాంకా గాంధీ హెలిప్యాడ్లో కలుసుకుని ఆప్యాయంగా పలకరించిన వీడియో కొద్దిరోజుల కిందటే సోషల్ మీడియాలో హల్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా రాహుల్ గాంధీ ట్రాక్టర్ నడిపిస్తున్న వీడియో కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్లా మారింది.