ఓటమికి నైతిక భాద్యత వహిస్తూ .. పీసీసీ అధ్యక్ష పదవికి రఘువీరారెడ్డి రాజీనామా ?
జరిగిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర ఓటమని చవిచూసింది .. రాష్ట్రంలో ఒక్క సీటు అంటే ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది .. కొన్ని స్థానాల్లో అయితే డిపాజిట్లు కూడా దక్కించుకోలేకపోయింది. 2014 ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పరిస్థితి కూడా ఇంతే .. జాతీయ పార్టీకి ఇంతా ఘోర ఓటమని చవిచూడడంతో ఓటమికి నైతిక భాద్యత వహిస్తూ పీసీసీ అధ్యక్ష పదవికి రఘువీరారెడ్డి రాజీనామా చేశారనే వార్తలు వినిపిస్తున్నాయి. పోలింగ్ ముగిసిన వెంటనే గత నెల 11వ తేదీనే ఆయన తన లేఖను ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్గాంధీకి పంపినట్లు సమాచారం...