ఏపీ టీడీపీలో అసమ్మతి జ్వాలలు ఎగసిపడుతున్నాయి. టిక్కెట్టు విషయంలో నేతల మధ్య విబేధాలు తీవ్రమయ్యాయి. అధిష్టానం ప్రకటించిన అభ్యర్థులను వ్యతిరేకిస్తూ తెలుగు తమ్ముళ్లు పలుచోట్ల నిరసనలు చేపట్టారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో పార్టీ టిక్కెట్ లింగారెడ్డికి కేటాయించడంతో మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి తన వర్గీయులతో ఆందోళనకు దిగారు.పార్టీ కార్యాలయంలో ఫ్లెక్సీలు, జెండాలను ధ్వంసం చేశారు. కాసేపట్లో ఆయన తన భవిష్యత్ కార్యాచరణను ప్రకటించే అవకాశం కనిపిస్తోంది.