ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి రాష్ట్రపతి కోవింద్ శుభాకాంక్షలు తెలిపారు. జగన్కు రాష్ట్రపతి కోవింద్ ఫోన్ చేసి అభినందించారు. విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణస్వీకారం చేసిన సంగతి తెలిసిందే. వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీ ట్విటర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు.