తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మిర్యాలగూడ ప్రణయ్ హత్య కేసులో ప్రధాన నిందితుడు, అమృత తండ్రి తిరునగరు మారుతిరావు ఆదివారం ఉదయం వరంగల్ సెంట్రల్ జైలు నుండి విడుదలయ్యారు. ఈ కేసులో మారుతీరావు(ఏ1), ఆయన సోదరుడు శ్రవణ్కుమార్(ఏ5), అబ్దుల్ కరీం(ఏ4)కు తెలంగాణ హైకోర్టు శుక్రవారం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. దీంతో వరంగల్ సెంట్రల్ జైలులో ఉంటున్న వారు ముగ్గురు కొద్దిసేపటికి క్రితం విడుదలయ్యారు. అయితే, మారుతీరావుకు బెయిల్ మంజూరు కావడంపై ప్రణయ్ తల్లిదండ్రులు, అమృత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వారు బయటకు వస్తే తమకు ప్రాణహాని ఉందని, సాక్ష్యాధారాలు తారుమారు చేసే అవకాశం ఉందని, అందువల్ల వారి బెయిల్ను రద్దు చేయాలని వారు కోరుతున్నారు.