ఏపీలో వేగంగా మారుతున్న రాజకీయ పరిణామాలు..పొత్తులపై దృష్టి సారించిన..

Update: 2019-01-24 05:24 GMT

ఏపీలో రాజకీయ పరిణామాలు ఆసక్తిగా మారుతున్నాయి. ఎన్నికల్లో నువ్వా నేనా అంటూ పోటీ పడుతున్న అధికార టీడీపీ ప్రతిపక్ష వైసీపీ బలబలాలపై లెక్కలు వేసుకుంటున్నాయి. పొత్తులపై దృష్టి సారించిన ఇరు పార్టీలు కలిసి వచ్చే పార్టీలో కోసం అన్వేషణ ప్రారంభించాయి. జనసేన, వామపక్షాలు ఎవరితోనైనా కలుస్తాయా ? కలిస్తే ఎవరితో కలుస్తాయి ? లేక ఒంటరి పోరు చేస్తే ఏ‍యే పార్టీలను కలుపు కుంటాయనే ఆసక్తి నెలకొంది. ఇఫ్పటికే ఒంటరి పోరు చేస్తామంటూ కాంగ్రెస్‌, బీజేపీలు ప్రకటించిన నేపధ్యంలో ప్రతిపక్ష వైసీపీ స్టాండ్‌పై ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. కలిసి వచ్చే పార్టీలు కనిపించకపోవడంతో వైసీపీ అధినేత జగన్‌ నియోజకవర్గాల వారిగా సమీక్ష నిర్వహిస్తున్నారు.

Full View  

Similar News