18 రోజుల్లో పెళ్లి... ఇంతలోనే బాంబ్ డిఫ్యూజ్ చేస్తూ ఆర్మీ మేజర్ వీరమరణం

Update: 2019-02-18 07:56 GMT

నౌషేరా సెక్టర్‌లో ల్యాండ్ మైన్‌ డిఫ్యూజ్ చేయడానికి ప్రయత్నించి అమరుడైన మేజర్ చిత్రేష్ సింగ్ బిస్త్‌ మృతదేహాన్ని ఆయన స్వస్థలానికి తీసుకువచ్చారు. మేజర్ మృతదేహాన్ని చూసిన కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. చిత్రేష్‌కు మరో 18 రోజుల్లో వివాహం జరగనుంది. ఇప్పటికే పెళ్లి ఏర్పాట్లు చేసే పనిలో తల్లిదండ్రులు, కాబోయే అత్తమామలు బిజీ బిజీగా ఉన్నారు. ఇటువంటి సమయంలో చిత్రేష్ మరణవార్త వారిని కలిచివేసింది. తల్లిదండ్రులను ఓదార్చడం ఎవరికీ సాధ్యం కావడం లేదు. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ కూడా మేజర్ చిత్రేష్ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు వచ్చారు. మేజర్ చిత్రేష్ ఇంటి వద్ద అమర్ రహే అమర్ రహే ఇండియా ఆర్మీ అమర్ రహే అంటూ నినాదాలు మార్మోగాయి. 

Similar News