భారత్ పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పందించారు. పాకిస్తాన్కు ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఉగ్రవాదంపై తీరు మార్చుకోవాలని హెచ్చరించారు. దేశంలోని ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేయాలని టెర్రరిస్టు గ్రూపులపై తక్షణం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. లేకుంటే తీవ్ర నష్టం జరుగుతుందని సైనిక చర్య వరకు పరిస్థితిని కొని తెచ్చుకోవద్దని హితవు పలికారు.