ఇండో పాక్ సరిహద్దుల్లో యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ పాకిస్తాన్ మంత్రి షేక్ రషీద్ అహ్మద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్ పాక్ మధ్య యుద్ధం వస్తే రెండో ప్రపంచ యుద్ధం కంటే తీవ్రంగా ఉంటుందని అన్నారు. జరగబోయే యుద్ధమే దాయాది దేశాల మధ్య చివరి యుద్ధమవుతుందని చెప్పారు. ఇండో పాక్ మధ్య వచ్చే 72 గంటలు అత్యంత కీలకమన్నపాకిస్తాన్ మంత్రి షేక్ రషీద్ అహ్మద్ యుద్ధమా శాంతా అనేది వచ్చే ఆ 72 గంటల్లోనే తేలుతుందని వ్యాఖ్యానించారు. పాకిస్తాన్ ఎలాంటి పరిస్థితిపైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉందని అన్నారు. యుద్ధం గురించి పాకిస్తాన్ మంత్రి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి.