బాధ్యతలు స్వీకరించిన ఏపీ కొత్త సీఎస్

Update: 2019-04-06 09:39 GMT

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఎల్వీ సుబ్రహ్మణ్యం బాధ్యతలు స్వీకరించారు. సీ.ఎస్. అనీల్ చంద్ర పునేఠ పై ఎలక్షన్ కమిషన్ వేటు వేసి బదిలీ చేసి ఆయన స్థానంలో ఎల్వీ సుబ్రహ్మణ్యంని కొత్త సీఎస్‌గా నియమించింది. వాస్తవానికి 1984 వ సంవత్సరం బ్యాచ్ కి చెందిన అనీల్ చంద్ర పునేత కన్నా 1983 వ బ్యాచ్ కి చెందిన ఎల్వీ సుబ్రహ్మణ్యం సీనియర్. అయితే చంద్రబాబు పునేతని సీ.ఎస్. గా ఎంపిక చేయడంతో ఎల్వీ సుబ్రహ్మణ్యం అప్పటి నుంచీ అసంతృప్తిగా ఉన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం తాజా నిర్ణయంతో సుబ్రహ్మణ్యం ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సేవలందించనున్నారు.  

Similar News