ఎంఐఎం ఎమ్మెల్యేకు అరుదైన చాన్స్.. కేసీఆర్కు ఒవైసీ థాంక్స్
చార్మినార్ నియోజకవర్గం నుండి వరుసగా ఆరుసార్లు ఎమ్మెల్యేగా ముంతాజ్ అహ్మద్ ఖాన్ ఎన్నికయ్యారు. అయితే ఎంఐఎం శాసనసభ్యుడు ముంతాజ్ అమ్మద్ఖాన్కు అరుదైన గౌరవం దక్కనుంది.
చార్మినార్ నియోజకవర్గం నుండి వరుసగా ఆరుసార్లు ఎమ్మెల్యేగా ముంతాజ్ అహ్మద్ ఖాన్ ఎన్నికయ్యారు. అయితే ఎంఐఎం శాసనసభ్యుడు ముంతాజ్ అమ్మద్ఖాన్కు అరుదైన గౌరవం దక్కనుంది. తెలంగాణ శాసనసభ ప్రొటెం స్పీకర్గా మజ్లిస్ ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్ ఎంపికైనట్లు సమాచారం అందుతోంది. ముంతాజ్ మహ్మద్ ఖాన్ ను ప్రొటెం స్పీకర్గా ఎంపిక చేయడం పట్ల హర్షం వ్యక్తంచేసిన ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ. ముఖ్యమంత్రి కేసీఆర్కు కృతజ్ఞతలు చెబుతూ ట్వీట్ చేశారు. ప్రొటెం స్పీకర్గా ఎన్నికైన ముంతాజ్ మహ్మద్ ఖాన్ శాసనసభకు వరుసగా ఆరుసార్లు ఎన్నికయ్యారు.