సౌంతాప్టన్ వన్డేలో.. ధోనీ స్పెషల్ అట్రాక్షన్గా నిలిచాడు. ఆ మ్యాచ్లో అతను ధరించిన గ్లౌజ్లు అందర్నీ ఆకట్టుకున్నాయి. తనలో ఉన్న దేశభక్తిని మరోసారి చాటాయి. ఈ మ్యాచ్లో ధోనీ ముదురు ఆకుపచ్చ కలర్లో ఉన్న గ్లౌజ్లు ధరించాడు. ఈ మ్యాచ్ లో దక్షిణాఫ్రికా మొదట బ్యాటింగ్ కు దిగగా టీమిండియా ఫీల్డింగ్ చేయాల్సివచ్చింది. ఈ సమయంలో వికెట్ కీపర్ గా ధోని రెగ్యులర్ గ్లవ్స్ తో కాకుండా కాస్త ప్రత్యేకమైన వాటిని వాడారు. ధోని గ్లోవ్స్పై ఉన్న 'బలిదాన్'(త్యాగం) చిహ్నం దక్షిణాఫ్రికా బ్యాట్స్మన్ ఫెలుక్వాయోను (34) సంప్ ఔట్ చేసిన సమయంలో బయటపడింది.
ఆ గ్లొవ్స్ ఎక్కడో తయారుచేసినవి కావు. ఇండియన్ పారామిలటరీ రెజిమెంట్తో తయారు చేసిన గ్లోవ్స్. వాటిని ధరించి బరిలోకి దిగిన మిస్టర్ దేశరణ కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులకు గుర్తుగా ఈ గ్లోవ్స్ వాడినట్లు తెలుస్తోంది. ఇలా అసలు ప్రచారమే లేకుండా మనస్పూర్తిగా అమరవీరుల త్యాగాలను గుర్తుచేసుకుంటూ ధోని చేసిన పనికి భారత అభిమానులు ఫిదా అయిపోయారు. అమర జవాన్లకు నివాళిగా ధోని చేసిన పనిపై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది. 'అందుకే మీరంటే మాకు అత్యంత అభిమానం, గౌరవం.. మీకిదే మా సెల్యూట్' అంటూ అభిమానులు పేర్కొంటున్నారు.