హైదరాబాద్‌ జీడిమెట్లలో దారుణం

Update: 2019-04-23 05:15 GMT

హైదరాబాద్‌ జీడిమెట్ల షాపూర్‌నగర్‌లో దారుణం చోటు చేసుకుంది. కుటుంబ కలహాలతో అర్ధరాత్రి ఓ తల్లి తన కూతురు గొంతు కోసి హతమార్చింది. అనంతరం ఆమె కూడా ఆత్మహత్యాయత్నం చేసింది. చిన్నారి మృతి చెందగా, తల్లి సుశీలను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. సుశీల భర్త నారాయణరెడ్డి జీడిమెట్ల పారిశ్రామికవాడలో ప్రైవేటు ఎంప్లాయ్‌గా పనిచేస్తున్నాడు. భర్త విధులకు వెళ్లిన అనంతరం సుశీల ఈ ఘతకానికి పాల్పడింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

Similar News