నేడు వారణాసికి మోదీ.. 5 కిలోమీటర్లు విజయోత్సవ ర్యాలీ..

Update: 2019-05-27 03:42 GMT

ప్రధాని నరేంద్ర మోడీ ఇవాళ వారణాసిలో పర్యటిస్తారు. తనను అఖండ మెజార్టీతో గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేయనున్నారు. ఈ సందర్భంగా సుమారు 5 కిలోమీటర్ల మేర విజయోత్సవ ర్యాలీని చేపడతారు. దీంతో వారణాసి సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. ఈ పర్యటనలో మోడీ కాశీ విశ్వనాథుడిని కూడా దర్శించుకుంటారు. మరోవైపు మోడీ పర్యటన సందర్భంగా ఏర్పాట్లను యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్‌ పర్యవేక్షించారు. ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ నెల 30న రాత్రి 7 గంటలకు మోదీ రెండోసారి ప్రధానిగా ప్రమాణస్వీకారం చెయ్యబోతున్నారు. కాశీ విశ్వనాథుడి ఆలయంలో ప్రధాన పూజారి ఆచార్య అశోక్ ద్వివేదీ, నేడు మోదీ తరపున పూజ చెయ్యబోతున్నారు. 2014లో కూడా విజయం తర్వాత మోడీ ఇక్కడ పూజలు చేశారు. 

Similar News