ప్రధాని మోడీ తన పదవికి రాజీనామా చేశారు. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ను కలిసి రాజీనామా పత్రాన్ని సమర్పించగా దాన్ని ఆయన ఆమోదించారు. కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు ప్రధానిగా కొనసాగాలంటూ మోడీని రాష్ట్రపతి కోరారు. మంత్రి మండలిని రద్దుచేయాలని ఈ సాయంత్రం జరిగిన కేంద్ర కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకున్నారు. అంతకు ముందు, ప్రధాని మోడీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. 16వ లోక్సభను రద్దు చేస్తూ తీర్మానాన్ని కేబినెట్ ఆమోదించింది. ప్రధాని రాజీనామాతో 17వ లోక్సభ ఏర్పాటు కోసం ప్రక్రియ ప్రారంభం కానుంది. కేంద్ర ఎన్నికల సంఘం కొత్త లోక్సభ కోసం అధికారిక నోటిఫికేషన్ విడుదల చేస్తుంది. మోడీ ఆధ్వర్యంలో కొత్త ప్రభుత్వం మే 30న కొలువుదీరనుంది.