5కే వాక్‌లో మంత్రి పరిటాల సునీత

మంత్రి పరిటాల సునీత పోటీ పడి కాలేజ్ విద్యార్ధులతో కలిసి పరుగులు పెట్టారు.

Update: 2019-01-06 08:43 GMT

మంత్రి పరిటాల సునీత పోటీ పడి కాలేజ్ విద్యార్ధులతో కలిసి పరుగులు పెట్టారు. రాప్తాడులోని కనగానిపల్లిలో నిర్వహించిన 5కే రన్‌లో పాల్గొన్న ఆమె పోటీపడి రన్‌లో పాల్గొన్నారు. ఆరో విడత మా ఊరు - జన్మభూమిలో భాగంగా నిర్వహించిన ర్యాలినీ ఆమె ప్రారంభించిన అనంతరం స్వయంగా పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆమె ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఏపీ ప్రజలను మోసం చేశారంటూ ఆమె ఆరోపించారు. భవిష్యత్ తరాల గురించి ఆలోచించే వారు చంద్రబాబు నాయకత్వాన్ని సమర్ధించాలంటూ ఆమె పిలుపునిచ్చారు . 

Full View

Similar News