అఖండ విజయం సాధించి.. ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధం అవుతున్న వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కి పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు అభినందనలు తెలిపారు. మర్యాదపూర్వకంగా ఆయనను కలిసి శుభాకాంక్షలు
అందించారు. రాష్ట్ర చీఫ్ సెక్రటరీ ఎల్వీ సుబ్రహ్మణ్యం కాబోయే ముఖ్యమంత్రి జగన్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనతో కొద్ది సేపు మాట్లాడారు. తదుపరి ప్రభుత్వ ఏర్పాటు విషయమై తీసుకోవాల్సిన చర్యలు గురించి
మాట్లాడినట్టు సమాచారం.